అమ్మాయిలు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని ప్రతి రోజు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే పురుషుల మీద మహిళలు అత్యాచారం చేశారని మనం అరుదుగా వింటుటాం. అయితే అందంగా ఉన్న ఓ యువకుడిని ముగ్గురు యువతులు గదిలో నిర్బందించి మూడు రోజుల పాటు హత్యాచారం చేసి నరకం చూపించారు.
దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రాంతంలో ఈ చిత్రమైన కేసు నమోదైంది. ముగ్గురు మహిళలు ఒక 23 యేళ్ల వయసున్న యువకుడిని కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు నీసం నిద్రపోవడానికి కూడా తనకు అవకాశం ఇవ్వకుండా గంట గంటకు వయాగ్రా మాత్రలు ఇచ్చి తన మీద సామూహిక అత్యాచారం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడని దక్షిణ ఆఫ్రికా పోలీసు అధికారి క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ చెప్పారు.
తనతో కామ కోరికలను తీర్చుకోవడానికి ఆ మహిళలు మాదకద్రవ్యాలను, ఉత్ప్రేరకాలను ఇచ్చారని ఆ యువకుడు ఆరోపించాడు. వారు పలుమార్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎన్ని సార్లు అత్యాచారానికి పాల్పడ్డారో లెక్కబెట్టడం కూడా కష్టమని అతడు చెప్పడం గమనార్హం. మూడు రోజులు గడిచిన తర్వాత వాళ్లు తనను నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్లిపోయారని అతడు వివరించాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
గత శుక్రవారం (మే 26)వ తేదీన నెలంపస్ కు చెందిన 23 ఏళ్ల యువకుడు గమ్యం చేరుకోవడానికి 15 సీట్లు సామర్థ్యం ఉన్న ట్యాక్సీలో ఎక్కాడు. అప్పటికే ఆ ట్యాక్సీలో డ్రైవర్ తో పాటు ముగ్గురు యువతులు ఉన్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత డ్రైవర్ తన పక్క సీటులో కుర్చోవాలని ఆ యువకుడికి సూచించాడు. అంతే సీన్ కాస్త రివర్స్ అయ్యింది.
డ్రైవర్ సీటు పక్కన కుర్చున్న యువకుడికి వెనుక నుంచి సూది (ఇంజక్షన్) వేశారు. అతను మత్తులోకి జారుకుంటున్న సమయంలో డ్రైవర్ రూట్ మార్చాడు. తరువాత ఆ యువకుడు స్పృహలోకి వచ్చి చూడగా బెడ్ మీద ఉన్నాడు. అప్పటికే అతన్ని నగ్నంగా తయారు చేశారు.మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన అమ్మాయిలు యువకుడిని నిర్జీవ ప్రదేశంలో వదిలి వెల్లారు.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read