మార్చి నెలలో మొదలైన కరోనా కేసులు ఇప్పటికీ వదలడం లేదు. ఇప్పటికే మూడు నెలల పాటు కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచారు. ఈ మద్య సడలించిన తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మార్చి నెల నుంచి విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. అయితే ఈ మద్య పాఠశాలలు తెరుచుకునే యోచన చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో పాఠశాలలు తెరుచుకునేందుకు సిద్దమైనాయి. అయితే పాఠశాలలు తెరిచిన తొలి రోజే ఓ స్కూల్లో కలకలం రేగింది. స్కూళ్లలో సరైన ఆరోగ్య పరీక్షలు జరగడం లేదని తెలుస్తోంది.
కాగా, కేవలం శానిటైజ్, మాస్కులతో కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. అల్మోరా లో కరోనా వైరస్ సోకిన 12వ తరగతి విద్యార్థికి ఆ లక్షణాలు కనిపించకపోవడంతో నేరుగా తరగతి గదిలోకి వచ్చి కూర్చుకున్నాడు. అయితే ఆ విద్యార్థి తండ్రి తన ఇంట్లో వారికి కరోనా వచ్చిందని అనడంతో అందరూ అవాక్కయ్యారు.
ఉపాధ్యాయులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లి పరీక్ష చేయించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. తరగతికి హాజరైన మొత్తం 15 మంది విద్యార్థులను హోం క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో స్కూలంతా శానిటైజ్ చేసి, మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు అతడు ఇంట్లో చెప్పకుండానే స్కూలు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు
మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?