- Advertisement -
సార్వత్రిక ఎన్నికల వేల సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని ప్రతిప దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చుతుండగా ఇప్పుడు ఐదు ఈవీఎంలలో ఈ ప్రక్రియను చేపట్టాలని సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 35 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాల్సి ఉంటుంది. 50 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.