Friday, May 3, 2024
- Advertisement -

చీమ చిటుక్కుమ‌న్నా జ‌గ‌నేనా….

- Advertisement -
World Bank stops supporting Amaravathi because of YS Jagan saaya TDP

నిప్పు అని చెప్పుకొనే చంద్ర‌బాబునాయుడికి ఈమ‌ధ్య‌న కొత్త అల‌వాటు వ చ్చిప‌డింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి ఏది జ‌రిగినా దాన్ని ట‌క్కున ప్ర‌తిప‌క్షంమీద‌కు నెట్టేయ‌డం అల‌వాటుగా మారింది.

సకాలంలో వర్షాలు రాకపోతే జగన్‌ తప్పు, కోర్టులు మొట్టికాయలేస్తే అది జగన్‌ చేసిన నేరం.. ఇంకా ఇంకా ఏం జరిగినాసరే, అన్నిటికీ వైఎస్‌ జగనే బాధ్యుడు. మంచి జ‌రిగితే క్రెడిట్ బాబుకు… చెడుజ‌రిగితే జ‌గ‌న్‌కు.

{loadmodule mod_custom,GA1}

తునిలో రైలు తగలబడిన కేసులో వైఎస్‌ జగన్‌ కుట్రేనని తేల్చారు టీడీపీ నేతలు. సాక్షాత్తూ హోంమంత్రి కూడా, ప్రతిపక్షంపై ఆరోపణలు చేసేశారు. ఏదయ్యా సాక్ష్యం.? అనడిగితే మాత్రం, నోళ్ళు వెల్లబెట్టడంలో టీడీపీ నేతలకు సాటి ఇంకెవరూ రారంతే.
తాజాగా, ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్ర‌పంచ‌బ్యాంకు నిరాక‌రించింది. దీన్ని కూడా జ‌గ‌న్ మీద‌నే నెట్టేశారు. అప్పుగా నిదులు ఇవ్వ‌మ‌ని ఇచ్చ‌ ‘అప్పు’ ఇవ్వదలచుకుంటే, కొందరు అడ్డుపడుతున్నారట. రైతుల పేరుతో, ఏకంగా ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాసేస్తున్నారట.
ప్రపంచ బ్యాంకు అమరావతికి ఇవ్వాల్సిన అప్పు విషయంలో పునరాలోచన పడిందంట. దీని వెనుక పెద్ద కుట్ర వుందని, అధికార పార్టీకి ‘తోక’లా వ్యవహరించే, ఓ మీడియా సంస్థ రచ్చ షురూ చేసేసింది. రైతులు రాసిన లేఖల్లో వాస్తవం వుంది కాబట్టి.. ప్రపంచ బ్యాంకు అడ్వయిజరీ కమిటీ, ఆ లేఖల్ని పరిగణనలోకి తీసుకుని, వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయడానికి అమరావతికి ప్రతినిథి బృందాన్ని పంపాలనుకుంటోందట.

{loadmodule mod_custom,GA2}

ఇలా ఏంజ‌రిగినా అన్ని జ‌గ‌న్ మీద‌కు నెట్టేయడం ఆదారాల్లేక తోక‌ముడ‌వ‌డం టీడీపీకి అల‌వాట‌యిపోయింది.తమ చేతకానితనాన్ని, ప్రతిపక్షం మీద ఆరోపణలతో ‘మసిపూసిమారేడుకాయని’ చేసెయ్యాలన్నది బాబు నైజంలా క‌నిపిస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}6ElKyZUmoQY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -