Saturday, May 18, 2024
- Advertisement -

అన్నా హజారే హెచ్చరిక.. మళ్ళీ నిరాహార దీక్ష..!

- Advertisement -

తాను మళ్లీ నిరాహార దీక్ష చేపడతానని కేంద్రాన్ని హెచ్చరించారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. వ్యవసాయ రంగంలో ఎంఎస్​ స్వామినాథన్​ కమిషన్ సిఫారసులు​ సహా తన డిమాండ్​లను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో తాను తిరిగి నిరాహార దీక్ష మొదలుపెడతానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్​ తోమర్​కు లేఖ రాశారు హజారే.

స్వామినాథన్​ కమిషన్​ సిఫారసుల అమలుపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక రూపొందిస్తుందని.. 2019లో నాటి వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్​ సింగ్​ ఇచ్చిన హామీ పత్రాన్ని.. ఈ లేఖలో జోడించారు హజారే. వ్యవసాయ ధరల కమిషన్​కు(సీఏసీపీ) స్వతంత్రత కల్పించాలని డిమాండ్​ చేశారు.

కమిటీ నివేదిక ఆధారంగా నా డిమాండ్​లపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఎటువంటి పురోగతి లేదు. అందుకే, 2019 ఫిబ్రవరి 5న విరమించుకున్న నిరాహార దీక్షను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను,” అని తోమర్​కు రాసిన లేఖలో హజారే పేర్కొన్నారు. దీక్ష చేపట్టే తేదీ, ప్రదేశాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -