Friday, April 26, 2024
- Advertisement -

కరోనా కి మరో బిజేపి ఎమ్మెల్యే బలి..!

- Advertisement -

దేశంలో కరోనా ప్రభావం ఎంతగా చూపిస్తుందో అందరికీ తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఈ కరోనా భారిన పడి మరణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల్లో కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు పలువురు ప్రముఖ నేతలు కరోనాతో కన్నుమూశారు. తాజాగా కరోనా సోకి ఉత్తరాఖండ్​ బిజేపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్​ జీనా మృతి చెందారు.

కొవిడ్​-19 కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే ఉన్న ఆయన.. ఢిల్లీలోని సర్​ గంగారామ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్​ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయారు.

దేశ రాజధాని ఢిల్లీలో వైరస్​ విలయం కొనసాగుతోంది. మరో 8,593 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 4లక్షల 59వేల 975కి ఎగబాకింది. మరో 85 మంది మృతితో.. చనిపోయిన వారి సంఖ్య 7,228కి చేరింది.

తెలంగాణలో మరో ఎంపీకి కరోనా పాజిటివ్!

ఆ దేశం నుంచి మూడో వాక్సిన్..!

దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -