దేశంలో కరోనా ప్రభావం ఎంతగా చూపిస్తుందో అందరికీ తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఈ కరోనా భారిన పడి మరణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల్లో కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు పలువురు ప్రముఖ నేతలు కరోనాతో కన్నుమూశారు. తాజాగా కరోనా సోకి ఉత్తరాఖండ్ బిజేపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి చెందారు.
కొవిడ్-19 కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే ఉన్న ఆయన.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ విలయం కొనసాగుతోంది. మరో 8,593 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 4లక్షల 59వేల 975కి ఎగబాకింది. మరో 85 మంది మృతితో.. చనిపోయిన వారి సంఖ్య 7,228కి చేరింది.
తెలంగాణలో మరో ఎంపీకి కరోనా పాజిటివ్!