Friday, March 29, 2024
- Advertisement -

కరోనాతో బీజేపీ ఎంపీ కన్నుమూత!

- Advertisement -

మధ్యప్రదేశ్​లోని ఖండ్వా బిజెపీ ఎంపీ నంద్​ కుమార్​ సింగ్​ చౌహాన్​ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం నంద్​ కుమార్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం తుది శ్వాస విడిచారు.

నంద్​ కుమార్​ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్​లో బిజెపిను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు.

నంద్​ కుమార్​ కుటుబం సభ్యులకు సంతాపం తెలిపారు.”ప్రజాదరణ పొందిన నేత నందూ భయ్యా మమ్మల్ని వీడి వెళ్లారు. ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని, అంకితభావంతో ఉన్న నేతను భాజపా కోల్పోయింది. నంద్​ కుమార్ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు” అని శివరాజ్​ సింగ్ చౌహాన్​​ తెలిపారు.

ఎల్లో డ్రెస్‌లో అద‌ర‌గొడుతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి

స్టాలిన్ పై ఊహకి అందని వ్యక్తి పోటీ.. ఎవరో తెలుసా..!

ఏపి పోలీస్ విభాగంలో కీలక నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -