- Advertisement -
రైతుల డిమాండ్లను వినిపించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మట్టిలోని ప్రతి కణం ప్రతిధ్వనిస్తోందని, ప్రభుత్వం వినాల్సిన అవసరం ఉందన్నారు. రైతు నిరసనలపై మూడు నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేంద్రాన్ని విమర్శిస్తూ, ఆందోళనాకారులు పడుతున్న కష్టాలు తెలిపేలా వీడియో ఉంది.
ఈనెల 24న రాహుల్ గాంధీ.. సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీలతో కలిసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ 2 కోట్ల మంది రైతులు సంతకం చేసిన మెమోరాండంను రామ్నాథ్కు సమర్పించారు.