- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్కు సమాంతరంగా కాల్వలు తవ్వుతోందని…. ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల మరోసారి అలంపూర్ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడే ప్రమాదముందన్నారు.
ఏపీ సర్కారు జల చౌర్యం చేస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ నుంచి నీటి బోట్టు వదులుకోబోమన్న సంపత్… ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ది ఉంటే తుమ్మిళ్ల మూడు రిజర్వాయర్లను పూర్తి చేయాలన్నారు. రేవంత్రెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
భగ్గుమన్న ఇరు వర్గాలు.. మధ్యలో పొలింగ్ ఏజెంట్ పై కన్నెర్ర..!
నిర్మల్ జిల్లాలో వింత ఎన్నిక.. వార్డు సభ్యురాలు అపహరణ..!