పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. వైజాగ్ లో జరిగి సభలో బండారు , అతని కుమారుడు అప్పలనాయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు.
అయితే పవన్ ఆరోపణలకు స్పందించిన బండారు నేను అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను, రెండు సార్లు ఎంఎల్ఎ, మంత్రిగా పనిచేశాను. అధికార పార్టీ లేదా ప్రతిపక్షంలో ఉన్నా నేటి వరకు నాపై ఎటువంటి ఆరోపణలు రాలేదు. కానీ పవన్ నేను వందల కోట్లను వసూలు చేస్తున్నట్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. పవన్ రాజకీయాల్లో కొత్త, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించడం కాదని ఎద్దేవా చేశారు.
అంతే తాను ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లను పంపుతాను.. వాటిలో ఉన్న దానికి కంటే ఒక్కరూపాయి ఎక్కువగా ఉన్నా తాను ఎలా శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను అవినీతి పాల్పడ్డానని ఆరోపిస్తున్న కమిటీ వేయమని అంటున్న పవన్ ..ఏ అధికారంతో కమిటీని వేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు.
పవన్ ఆరోపణలు చేయోచ్చు. కానీ నేను అలా అరోపణలు చేయలేను. నేనొక పబ్లిక్ ఫిగర్ ను అంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.