Friday, April 26, 2024
- Advertisement -

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

- Advertisement -

ఈవీఎంతో అధికార బీజేపీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ గత కొంత కాలంగా విమర్శలు చేస్తోంది. ఎన్నికల సంఘం అధికారులను కలిసి పలు మార్లు ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన శిబిరంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు స్వస్తి పలకాలని నిర్ణయించింది.

ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావలని భావిస్తోంది. ఈవీఎంల అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా లాంటి దేశాల్లోనూ ఈవీఎంలను వినియోగించడం లేదనీ.. పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని కాంగ్రెస్ గత కొంత కాలంగా వాదిస్తూ వస్తోంది.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని మరోవైపు అధికార బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చే అంశంపై భావసారూప్యత గల పార్టీలతో చర్చించాలని నిర్ణయించింది.

సమాధిలోకి వెళ్లానన్న నిత్యానంద

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా

మంత్రిపై భూకబ్జా ఆరోపణలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -