- Advertisement -
బెంగాల్ నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బారులుతీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్ నియోజకవర్గంలోని కుల్బేరియా ధర్మతలా ఎఫ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బారులు తీరారు ఓటర్లు. అలిపుర్దౌర్లోని పోలింగ్ కేంద్రంలో ఓ మహిళ ఓటు వేసేందుకు సాయం చేశారు భద్రతా సిబ్బంది. ఆమెను ఎత్తుకుని బూత్లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు.
కూచ్ బెహర్ జిల్లా నటబారి నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి రవింద్ర నాత్ ఘోష్ హెల్మెట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఎదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానిని నుంచి తప్పించుకునేందుకే తాను హెల్మెట్తో పోలింగ్ బూత్కు వచ్చినట్లు చెప్పారు.
ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు