Wednesday, May 8, 2024
- Advertisement -

అల్లూ అర్జున్ గౌతం మీనన్ దర్సకత్వం లో

- Advertisement -

మల్టీ స్టారర్ సినిమాలకి మహేష్ బాబు – వెంకటేష్ శ్రీకారం చూపించిననాటి నుంచీ తెలుగు హీరోలు ఎవరికి వారు ఆసక్తికరంగా ఈ రకమైన  సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

డైరెక్టర్ లు కూడా ఇద్దరు ఇద్దరు భారీ స్టార్ లని దృష్టిలో పెట్టుకుని పెద్ద బడ్జెట్ సినిమాలు రాయడం లో ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు తో పాటు మిగిలిన ఇండస్ట్రీ వారు కూడా మల్టీ స్టారర్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య నాగార్జునా – కార్తీ ఇద్దరూ కలిసి ద్విభాషా మల్టీ స్టారర్ కి తెర తీసారు. ” ఊపిరి ” అంటూ ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.

ఇప్పుడు రుద్రమ దేవి స్టార్ గా వెలుగు ఒందుతున్న అల్లూ అర్జు త్వరాలో ఇతర భాషా స్టార్ హీరోలతో ద్విభాషా చిత్రాలు చెయ్యబోతున్నాం అని చెప్పాడు. తానే ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మనకి ఉన్న సమాచారం గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఒక సినిమాకి అల్లూ అర్జున్ సంతకం పట్టాడు అంటున్నారు. బోయపాటి సినిమా తరవాత దాంట్లో అల్లూ కనిపిస్తాడు కావచ్చు. 

కాలేజ్ డేస్ తర్వాత సెపరేట్ అయిన నలుగురు ఫ్రెండ్స్ ఒక పెళ్ళిలో కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే అక్కడ ఏం జరిగింది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఆ కథ కోసం సౌత్ ఇండియాలోని ఒక్కో భాష నుంచి ఒక్కో హీరోని ఎంచుకోవడానికి సిద్దమయ్యాడు. 

అన్ని భాషల్లో ఈ సినిమా ఉంటుంది , తమిళం తో పాటు మలయాళం లో కూడా బన్నీ కి మంచి మార్కెట్ ఉండడం తో ఈ సినిమా కి మంచి కలక్షన్ లు కూడా ఉండచ్చు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -