భార్లు లావుగా ఉండటం వల్ల.. భర్తలు డయాబెటిస్ గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉందట. ఇది వినడానికి విడ్డురంగా ఉన్నప్పటికి నిజం. మహిళలు ఎక్కువ ఆహారంను తీసుకుంటున్నట్లైతే.. వారి భర్తల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అని ఓ పరిశోధన వెల్లడించింది.
భార్యలు ఒబేసిటీతో బాధపడుతున్నట్లే.. మధ్య వయసు పురుషుల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాధం ఎక్కువ ఉందని ఓ అధ్యయనం తెలిపింది. భర్తలు లావుగా ఉన్న పర్వాలేదు.. అ ప్రభావం భార్యలపై ఉండదని.. సదరు అధ్యయనం స్పష్టం చేసింది. ఆహార అలవాట్లు సరిగ్గ ఉండకపోవడం.. శారీరక శ్రమ సరిగా ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పరిశోధకులు అంటున్నారు. లావుగా ఉన్న మహిళలు తమ భర్తల ఆహార అలవాట్లు, ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నారు. భర్తల జీవనశైలిపై భార్యల ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఈ పరిశోధన తేల్చింది.
ఆహారం వండే బాధ్యత ఆడవాళ్లపై ఉండటం లేదంటే వారు తమ గురించి అధికంగా శ్రద్ధ వహిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆర్హస్ యూనివర్సిటీకి చెందిన ఆడమ్ హల్మన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. పోర్చుగల్లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించారు.