ఓ హైటెక్ బిచ్చగాడు అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రయాణిస్తున్నఓ రైలు లో ఓ బిచ్చగాడు ధర్మం చేయాలని రైలు లో ఉన్న అందరిని అడిగాడు. ఆ రైలు లో తమ దగ్గర చిల్లర లేదని చెప్పడంతో ఆ బిచ్చగాడు తన వద్ద ఉన్న స్వైపింగ్ మిషన్ చూపెట్టాడు.
దీంతో ఆ రైలు లో ఉన్న వారంత షాక్ అయ్యారు. మీ దగ్గర చిల్లర లేకున్న పర్వలేదు.. స్వైప్ చేయండి ఆ రైలు లో ఉన్న వారిని బిచ్చగాడు అడగటంతో అక్కడ ఉన్నవారంత అతని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతేగాకుండా.. ఆ బిచ్చగాడు స్వైప్ మిషన్ పట్టుకున్న ఫోటోలను, వీడియోలను ఆ రైలులో ఉన్నవారంతా తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. హైటెక్ యుగం నడుస్తుంది అన్న మాట పక్కన పెడితే.. బిచ్చగాలకు స్వైప్ మిషన్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయంటూ ఆ రైలు లో ఉన్నవారంత చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ బిచ్చగాడు స్వైప్ మిషన్స్ ధర్మం చేయాలంటూ ఉన్న ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో తెగ హల్ చల్ చేస్తోంది. కొందరు తమ దగ్గర చిల్లర లేదని.. డెబిట్ కార్డులు మాత్రమే ఉన్నాయని చూపుతూ ఫోజుకొట్టేవారికి ఆ బిచ్చగాడు.. మీరు ఎంత ధర్మం చేస్తారో స్వైప్ చేయండి అంటూ.. నా దగ్గర స్వైప్ మిషన్ ఉందని చూపిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరెల్ అవుతోంది. మీరు కూడా ఓ సారి ఆ వీడియోని ఓ లుక్కేయండి.
{youtube}u3d20jwirbE{/youtube}
Related