- Advertisement -
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లి అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొహ్లీని అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ను చేసేసేవాడినని రవిశాస్త్రి అన్నారు.
విరాట్ కొహ్లి కెప్టెన్ అయినంత మాత్రాన ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జట్టులో ఉండడు అని అనుకోకూడదని, అతను ఎప్పట్లా జట్టులో కొనసాగుతాడని రవిశాస్త్రి అన్నారు. 2019 లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలకు విరాట్ కొహ్లి భారత జట్టుకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు.