నాభా నటేశ్ అంటే ఎవరికి పెద్దగా తెలియదు కాని, సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం అందరికి ఠక్కున గుర్తుకు వస్తుంది. ఈ శుక్రవారం థియోటర్లలో సందడి చేసింది నన్ను దోచుకుందువటే. మొదటి షో నుంచే సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమాలో హీరోయిన్గా నటించిన నాభా నటేశ్కు మంచి పేరు వచ్చింది. నాభా నటేశ్ అందంతో పాటు నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా నాభా నటేశ్ మాస్ రాజా రవితేజ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది.
రవితేజ కథానాయకుడిగా దర్శకుడు వీఐ ఆనంద్ ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నాభా నటేశ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. రవితేజతో సినిమా చేయడం వల్ల తన కెరీర్కు ఈ సినిమా హెల్ప్ అవుతుందని భావిస్తుందటా నాభా నటేశ్.ఇక రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే వీఐ ఆనంద్ సినిమా షూటింగ్ మొదలు పెడతాడు రవితేజ.