Thursday, May 2, 2024
- Advertisement -

ఇంట్లో అంట్లు కడిగిన జబర్దస్త్ సాయి తేజ.. ఎక్కడ ?

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో ద్వారా సాయి తేజ పరిచయం అయ్యాడు. జబర్దస్త్ లో ఎన్నో స్కీట్లలో లెడీ గెటప్ లో వేసి ప్రేక్షకులను అలరించారు. అయితే జబర్దస్త్ నుంచి ఉన్నట్లు ఉండి బయటకు వచ్చాడు. అయితే సాయితేజ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారి పింకీ గా పేరు మార్చుకున్నాడు. అయితే పింకీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజాగా కమెడియన్ సాయితేజ అలియాస్ పింకీ తెలుగు సీరియల్స్ లో నటించనుంది. ఈ విషయంను పింకీయే స్వయంగా చెప్పారు. జీతెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్ లో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను ఇన్నాళ్లు ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ తెలిపింది.

తాను నటించనున్న కొత్త సీరియల్ కూడా చూడాలని చెప్పింది. అయితే ఈ విషయంతో పాటు.. పింకీ ఓ ఇంట్లో అంట్లు కడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈ విషయంను కూడా తనను ఫ్యాన్స్ ఎన్నో ప్రశ్నలు వేశారని.. ఎవరైనా ఇంట్లో పని చేస్తున్నావా ? అంటూ ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొంది.

అయితే అది తన స్నేహితుల ఇల్లేనని.. ఆ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్లానని.. వారికి సాయంగా అక్కడున్న అంట్లు కడిగానని తెలిపింది. మన పనులు మనం చేసుకోవడమే మంచిదని తెలిపింది. తన ఇంట్లో కూడా తన పనులే తానే చేసుకుంటానని పింకీ చెప్పింది. ఈ విషయాలన్ని టిక్ టాక్ ద్వారా పింకీ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -