Wednesday, May 8, 2024
- Advertisement -

మహారాష్ట్రలోఘోర రోడ్డు ప్రమాదం….11 మంది దుర్మరణం

- Advertisement -

మహారాష్ట్రలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధూలే జిల్లా నీమ్గల్ గ్రామ సమీపంలో కంటైనర్, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఔరంగాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో వస్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును నీమ్గల్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్ బలంగా ఢీకొట్టడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిలో మరో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. వేగంగా వాహనాలు నడిపి ఎదురుగా వస్తున్న వాటిని గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -