నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది. గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కావాల్సిన అ చిత్రం.. లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ.. ప్రేక్షకుల్లో అనుకున్న టాక్ ను తెచ్చుకోలేకపోయింది. సస్పెన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆకట్టుకోలేక విఫలం అయ్యిందనే చెప్పుకోవచ్చు.
అయితే ఈ మూవీలో నటి సాక్షి మాలిక్ ఫోటోలను ఆమె పర్మిషన్ లేకుండా వాడారంటూ.. బాంబే హైకోర్టు ఈ సినిమాను వెంటనే అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలంటూ తీర్పును వెళ్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాని నటించిన ‘వి’ సినిమాలో ఓ సందర్భంగా ఫోన్ సాక్షి మాలిక్ ఫోటోను కమర్షియల్ సెక్స్ వర్కర్ చూపించారు. తన పర్మిషన్ లేకుండా ఇలా చూపించినందుకు సాక్షి మాలిక్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
పర్మీషన్ లేకుండా ఇలా ఫోటో పెట్టినందుకు గానూ సాక్షి మాలిక్ ఈ చిత్ర నిర్మాతలపై పరువు నష్టం దావా వేసింది. విచారణ చేసిన న్యాయ స్థానం కూడా‘ఇది పరువు నష్టం కలిగించే విషయమే’ అంటూ తేల్చింది. 24 గంటల్లో ‘’వి సినిమాను ఓటీటీ నుంచి తొలగించి.. ఆ సినిమాలో సాక్షి మాలిక్ ఫోటోను మొత్తమే లేకుండా చెయ్యాలని ఆదేశించింది. దీంతో నిర్మాతలు సాక్షి మాలిక్ ఫోటోను తొలగించే మళ్లీ రిలీజ్ చేస్తామంటూ కోర్టుకు విన్నవించుకున్నారు.
‘సత్యమేవ జయతే..’ అంటూ అదరగొడుతున్న పవన్
‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !