తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముందు వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కత్తి మహేశ్కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది.
అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ… ఫలితం దక్కలేదు. కత్తి మహేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు.
చైతూ, నాని సినిమాల విడుదల ఎప్పుడంటే..!