Friday, May 3, 2024
- Advertisement -

బిగ్‌బాస్ పెద్ద స్కాం అంటున్న తేజ‌స్వీ తండ్రి

- Advertisement -

తెలుగు బిగ్ బాస్‌లో రోజు రోజుకి మ‌రింత మ‌సాలా షూరు చేస్తున్నారు.వారం వారం ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి బిగ్ బాస్ హోస్‌లో.స్ట్రాంగ్ కంటెస్ట్స్ అయిన శ్యామ‌లా,తేజ‌స్వీ బిగ్‌బాస్ ఇంటి నుండి బ‌య‌టికి రావ‌డంతో అందరు ఆశ్చ‌ర్య‌పోయారు.దీంతో ఎవ‌రి అంచ‌నాలు అంద‌కుండ బిగ్ బాస్ జ‌రుగుతుంది.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్‌లో కాస్తా వివాదాలు ఎక్కువుగా జ‌రుగుతున్నాయి.ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని రీఎంట్రీ ఇచ్చేందుకు జరిపిన ఓటింగ్ ప్రక్రియ భారీ సక్సెస్ అయినట్లుగా బిగ్ బాస్ చెప్పుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే..తేజస్వి తండ్రి బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కాంగా ఆయన ఆరోపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఆక్షన్ పెట్టారని ఆరోపించారు.ఇక్క‌డ వారు చేయ‌ల‌నుకున్న‌దే చేశార‌ని ,ఓట్లను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని తేజ‌స్వీ తండ్రి ఆరోపించాడు.కాని బిగ్ బాస్ టీం మాత్రం ఓట్లు ఎక్కువ ఎవ‌రికి వ‌స్తే వారినే తీసుకున్న‌మ‌ని వెల్ల‌డించారు. బిగ్ బాస్ పబ్లిక్ పోల్ లో తనకు భారీగా ఓట్లు నమోదు అయ్యేలా చూసేందుకు తేజస్వి చాలానే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలని చూసిన తేజస్వి ఇందుకు భారీగానే ఖర్చు చేసినట్లుగా స‌మాచారం.

అయితే పబ్లిక్ లో ఆమెపైన ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమెకు ఓట్లు సరిగా నమోదు కాలేదని చెబుతున్నారు. పోలైన ఓట్లలో తేజస్వి మూడో స్థానం కూడా దక్కలేదన్న మాట వినిపిస్తోంది.దీంతోనే తేజ‌స్వీ తండ్రి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ర‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.హౌస్ నుంచి ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చారు శ్యామలా,నూత‌న నాయుడు.వీరిని ఇంకా బిగ్‌బాస్ హోస్‌లోకి ఎంట్రీ కాలేదు. వీరి ఎంట్రీ త‌రువాత షో ఎలా ఉంటుందో అని అంద‌రు అతృత‌గా ఎదురు చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -