దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణనమన త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం లైగర్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరో. ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వంద కోట్ల బడ్జెట్తో లైగర్ను తీస్తున్నాడు పూరీ. లైగర్ విడుదలైన వెంటనే జనగణమన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దేశభక్తి నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాలోనూ విజయ్ దేవరకొండే హీరో కావడం విశేషం. మొదట చాలా మంది హీరోల పేర్లు అనుకున్నా చివరకు రౌడీ హీరోనే ఓకే చేశాడు.
అయితే తొలుత మహేశ్ బాబుతో జనగణమన సినిమా చేయాలనుకున్నాడు పూరీ జగన్నాథ్. కానీ వరస ఫ్లాపుల్లో ఉండటంతో ఆయనతో సినిమా చేసేందుకు మహేశ్ ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో… అదే జోరుతో లైగర్తోనూ విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఇక జనగణమన సినిమానూ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో తాను కూడా నిర్మాతగా మారాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. తన కూతురు శిఖర పేరుతో శిఖర ప్రొడక్షన్స్ మొదలుపెట్టాడు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. 2023 ఆగస్టు 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. సరైన కథ దొరికితే తన కూతురు తెలుగు సినిమాల్లో నటిస్తుందని ఇప్పటికే ఆమె తండ్రి బోనీ కపూర్ ప్రకటించారు. మొత్తమ్మీద టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు జాన్వీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రిపుల్ ఆర్ను మించిన బడ్జెట్తో మహేశ్ మూవీ