ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో మస్త్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
దీంతో మహేశ్తో రాజమౌళి సినిమాపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మించిన బడ్జెట్తో దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందుకు సంబంధించి బేసిక్ స్టోరీ లైన్ ఐడియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. జేమ్ బాండ్ రేంజ్లో తెరకెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. దాంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.
టమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?