అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకమని పలికిన గొంతాయనది. తెలుగు వీర లేవర అంటూ…. తాను పాడే ప్రతి పాటకు ఎంతో గాడతను తీసుకువచ్చారు.అలాంటి గొంతు…నిన్నటి వరకు వేల పాటలు పాడి…
నేడు తనువు చాలించింది. క్యాన్సర్ తో పోరాడి తుది శ్వాస విడిచిన అపర ఘంటసాల… రామకృష్ణ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే గనుక… మనకు ముందుగా గుర్తొచ్చే పేరు పి.సుశీల.ఈవిడగారు రామకృష్ణకు మేనత్త అవుతుంది. అప్పట్లో ఓ ప్రత్యేక కారణంతోటే సుశీల పట్టుబట్టీ మరీ రామకృష్ణను అపర ఘంటసాల అని ప్రచారం చేసి మరీ నోటెడ్ చేసిందని చెబుతారు.అయితే రామకృష్ణ ముందునుంచి మర్యాదస్తుడు కావడంతో ఏనాడు ఆయనపై అనవసర మనే ముద్ర పడలేదు.అటు బాలు అండ్ కో కూడా రామకృష్ణ ను ఎంకరేజ్ చేసినవారిలో ఉన్నారు.5వేల పాటలు పాడిన రామకృష్ణ ఎక్కువగా ఆర్కెస్ట్రాలకే పరిమితమైపోయాడని లేకపోతే మరికొన్ని పాటలు పాడిన పాడేవాడని చెబుతూ ఉంటారు.రామకృష్ణ పాడిన పాటలకు మిగతావారిలా ఆయన వెనకేసిందంటూ ఏమీ లేదు.
సాయికిరణ్ ను కూడా నిజానికి సింగర్ గా మాంచి లైఫ్ ఇద్దామనుకున్నప్పటికీ….అతనికి నటన మీద ఉన్న శ్రద్ద పాటలపై లేకపోవడంతో వారసులు లేకుండా పోయారు.ఆయనతో వచ్చింది ఆయనతోనే పోయినట్లుగా మధుర కంఠం మూగబోయింది.