బాహుబలి సినిమా తర్వాత అందాల భామ అనుష్కకి దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా మంచి ఫాపులరిటీ వచ్చింది. ఆమె ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ అమెను చూడటానికి ఎగబడుతున్నారు. కానీ రీసెంట్ గా తమిళనాడులో అనుష్కశెట్టికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సంగతిపై ఇంకా అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇంతకు అక్కడ అనుష్కకు ఏమి జరిగిందంటే..బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న భాగమతి సినిమా ఆ సినిమా షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం పొల్లాచికి వెళ్లిన అనుష్క స్థానిక రవాణాశాఖ అధికారులు చుక్కలు చూపించారు. డ్రైవర్ వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో కార్వాన్ను అధికారులు సీజ్ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుష్క ప్రయాణిస్తున్న కార్వాన్ను పరిశిలీచిగా.. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాన్ను ఉపయోగిస్తున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
అందుకే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని రవాణాశాఖ సిబ్బంది వెల్లడించినట్టు సమాచారం. తనిఖీలో భాగంగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవట. వాటి గురించి ఆరా తీయగా డ్రైవర్ చెప్పిన సమాధానాలు రవాణాశాఖ సిబ్బందికి పలు సందేహాలు తలెత్తాయట. దాంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకొన్నారట. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తర్వాత అనుష్క మరోసారి చారిత్రక నేపథ్యమున్న సాగే భాగమతి సినిమాలో నటిస్తోంది. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లా జమీందార్ ఫేం జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.
{youtube}M4qKoyrewyo{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related