Saturday, April 27, 2024
- Advertisement -

కరోనాతో కోలీవుడ్ దర్శకుడి కన్నుమూత!

- Advertisement -

రెండు నెలల నుంచి దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత ఏడాది మొదలైన ఈ కరోనా వైరస్ గోల మద్యలో కాస్త విరామం ఇచ్చినా.. గత రెండు నెలల నుంచి తీవ్ర రూపం దాల్చుతుంది. కరోనా సెకండ్ వేవ్ తో పలువురు సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి తమిళ దర్శకుడు తమిర కన్నుమూశారు.

కె. బాలచందర్, భారతీరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తమిర 2010లో ‘రెట్టైసుళి’ చిత్రం రూపొందించారు. ఈ మూవీలో కె. బాలచందర్, భారతీరాజా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించాడు. 2018లో తమిర ‘ఆన్ దేవతై’ పేరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సముతిర కని, రమ్యా పాండియన్, కెవిన్, మోనికా ఇందులో కీలక పాత్రలు పోషించారు.

సత్యరాజ్, సీత ప్రధాన పాత్రల్లో తమిర ‘మై పర్ ఫెక్ట్ హజ్బెండ్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ తీశారు. ఈ వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కరోనాతో కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన ఆయన మంగళవారం మరణించారు. ఈ వార్త తెలిసి, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయి : షర్మిల

దృశ్యం సినిమా తలపించేలా హత్య..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -