Saturday, April 27, 2024
- Advertisement -

ఈడీ మరింత దూకుడు..కవిత టార్గెట్‌గా సోదాలు

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది .ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుండగా ఆమె బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.ఇవాళ ఉదయం నుండి కవిత బంధువులతో పాటు ఆమె భర్త బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

ప్రధానంగా ఈ కేసులో కవిత భర్త అనిల్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఈడీ అధికారులు. అనిల్,ఆయన బంధువులు ఎంత కూడబెట్టారన్నదానిపై లెక్క తేల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం కవిత భర్త అనిల్ ఢిల్లీలో ఉండగా అక్కడ సోదా చేస్తున్నారు ఈడీ అధికారులు.

లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు అందిన దానిపై ఆధారాలు సేకరించారు ఈడీ అధికారులు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారా చేరిందనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉండగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. న్యాయస్థానం కేజ్రీవాల్‌ను 6 రోజుల కస్టడీకి అనుమితించడంతో ఆయన్ని విచారించనుంది ఈడీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -