టీడీపీ – జనసేన పొత్తు పొడిచిన దగ్గరి నుండి ఇరు పార్టీల నేతల్లో కొత్త ఆశలు చిగురించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తులో ఎవరు లాభపడతారు..ఎవరు అడ్జస్ట్ అవుతారు అన్న ప్రశ్నకు సమాధానం అందరూ ఎక్స్పెక్ట్ చేసేశారు. ఎందుకంటే చంద్రబాబు గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పవన్కే నష్టం, ఆయనే అడ్జస్ట్ కావడం పక్కా అని భావించారు. తాజాగా జరుగుతున్న రాజకీయా పరిణామాలను గమనిస్తే పవన్ త్యాగానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్ విశాఖ పర్యటన సందర్బంగా ఆయన్ని కలిశారు టీడీపీ నేతలు. పవన్ని కలిసేందుకు పోటీ పడగా పొత్తులో భాగంగా తమ సీట్లకు ఎసరు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పవన్ని కలిశారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ నియోజకవర్గాలకు రావాల్సిందిగా కోరారు టీడీపీ నాయకులు. దీని ద్వారా పరోక్షంగా తామే అభ్యర్థులమని జనసేనానికి చెప్పారట. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీనిని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో పవన్ త్యాగం చేయక తప్పని సరి. ఎందుకంటే మెజార్టీ సీట్లను టీడీపీ ఇవ్వాల్సి వస్తుంది. అదే సమయంలో జనసేన నుండి టికెట్ రాని నేతలను బుజ్జగించే బాధ్యత కూడా పవన్దే. దీంతో సీట్లు, పోటీ చేసే స్థానాలు ఖరారైతే తప్ప ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. జనసేనకు విశాఖలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 25 వేలకు పైగా ఓట్లను సంపాదించారు జనసేన అభ్యర్థులు. ఇక పవన్ పోటీ చేసిన గాజువాక కూడా ఇదే జిల్లాలో ఉండటంతో జనసేన నుండి కూడా టికెట్ ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మరి పవన్ తీసుకునే నిర్ణయం ఎవరిని గాయపరుస్తుంది లేదా పవనే ఇబ్బంది పడతారా వేచిచూడాలి.