Monday, April 29, 2024
- Advertisement -

ధనుష్ రాసలీలలు!

- Advertisement -

తమిళ్ హీరో ధనుష్ మళ్లీ యూత్ ను టార్గెట్ చేశాడు. ఇంతకుముందు రఘువరన్ బీ టెక్ తో కాలేజ్ పిల్లలను విపరీతంగా అట్రాక్ట్ చేసిన ధనుష్.. తంగమగన్ తో దూసుకొస్తున్నాడు. తెలుగులో నవ మన్మథుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమాలో… సమంత, ఎమీ జాక్సన్ తో ధనుష్ విపరీతంగా రొమాన్స్ చేశాడట.

ఈ సినిమా రషెస్ చూసిన వాళ్లంతా ఇదే మాట చెబుతున్నారు. నవ మన్మథుడికి యూత్ బాగా అట్రాక్ట్ అవుతారని అంటున్నారు. ఇప్పుడు ధనుష్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ కూడా ఇందుకు బలం తెస్తోంది. ఈ సినిమాలో పెళ్లికి ముందు ఎమీ జాక్సన్.. పెళ్లి తర్వాత సమంత బాగా నటించారంటూ ఓ మీడియాతో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

రీసెంట్ గా సూపర్ సక్సెస్ అయిన రఘువరన్ బీ టెక్ ను.. ఓన్ బ్యానర్ లో నిర్మించి.. కోట్ల లాభం సంపాదించాడు ధనుష్. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ.. మళ్లీ యూత్ ను టార్గెట్ చేస్తూ.. సొంత బ్యానర్ లోనే నవ మన్మథుడు సినిమాను నిర్మించాడు. సినిమా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -