జబర్ధస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత ఢీ జోడిలో కూడా రష్మితో కలిసి.. ఓ టీం లీడర్ గా చేశాడు. ఈ ఢీ జోడిలో సుధీర్, రష్మి, ప్రదీప్ లు కనిసి.. చేసే స్కిట్ లు అందరినీ నవ్విస్తాయి. ఈ నెపథ్యంలో.. గ్రాండ్ ఫైనల్ లో చీఫ్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి, రమా గార్లను ఆహ్వానించారు.
{loadmodule mod_custom,GA1}
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళికి ఢీ జోడి వారు కూడా గ్రాండ్ ఎంట్రీ ఇప్పించారు. రాజమౌళిని మెప్పించే క్రమంలో సుధీర్ చేసిన హంగామా మాములుగా లేదు. మగధీర లాంటి పెద్ద హిట్ తర్వాత రాజమౌళిసునీల్ తో మర్యాద రామన్న మూవీ తీసారు. సో ఇప్పుడు కూడా బాహుబలి తర్వాత సుధీర్ ను హీరోగా పెట్టి మూవీ తీస్తారని చెప్పుకొచ్చాడు. ఇండైరెక్ట్ గా రాజమౌళి దర్శకత్వంలో.. సినిమా చేయాలన్న మనసులోని కోరికను బయట పెట్టాడు సుడిగాలి సుధీర్. అయితే ప్రదీప్ మాట్లాడుతూ.. రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే.. హీరోగా వెన్నెల కిశోర్, సప్తగిరి లాంటి వారిని పెట్టుకుంటాడు అనగా సుధీర్ తన కేసి చూపిస్తూ ఇటు చూసి చెప్పవయ్యా అంటూ కామెడీ చేశాడు.
{loadmodule mod_custom,GA2}
ఎంత జబర్దస్త్ షోతో పాపులర్ అయినప్పటికి.. రాజమౌళి దర్శకత్వంలో.. సుధీర్ చేసేంత సీన్ లేదని కొందరి వాదన. ఏదైమైనా ఢీ జోడితో ప్రేక్షకులకు మరింత చేరువైన సుధీర్ చూస్తుంటే వెండితెర మీదకు హీరోగా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది. సుధీర్ కోరిక కూడా అదే అని ఇటివలే డీ జోడి చుసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అర్ధం అవుతోంది.
{youtube}hM8zMUNTFK4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related