ఇటీవల దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత అంతలా భయపెడుతున్న వ్యాధి బ్లాక్ ఫంగస్. కరోనా చికిత్సలో భాగంగా.. స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలో బ్లాక్ ఫంగస్ సంక్రమిస్తున్నది. ఈ వ్యాధి ముఖ్యంగా కళ్లపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే చాలా మందికి కళ్లు కూడా తొలగించారు. ఇదిలా ఉంటే బ్లాక్ ఫంగస్తో కళ్లతో పాటు.. దంతాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్లల్లో దవడల నొప్పి.. పళ్ల చిగుళ్ల వాపు, చీము, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి.. కరోనా చికిత్స లో భాగంగా స్టెరాయిడ్స్ తీసుకున్నవారికి పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కోరుతున్నారు.
కరోనా వైరస్తో దంతాలకు రక్త సరఫరా జరిగే నాళాల్లో క్లాట్లు ఏర్పడి అవకాశం ఉంది. దీంతో అక్కడ రక్త సరఫరా నిలిచిపోయి.. ఫంగస్ ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా పై దవడ భాగంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కణజాలం కుళ్లిపోయే అవకాశాలు తక్కువ.
కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్లు ఎక్కువగా వాడిన వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. సైనస్లు వెనక దంతాల పై భాగంలో ఉంటాయి. కొందరికి దంతాలు సైనస్లలోకి వుంటాయి. అవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి.. సైనస్లపై బ్లాక్ఫంగస్ దాడి చేస్తే అది దంతాలకూ వ్యాపించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read