దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మరింతగా విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర బృందాలు.. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు,నగరాలు మళ్లీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది.
ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేశారు. మాస్కు లేకుంటే విధించే జరిమానాను రూ. 2 వేలకు పెంచింది కేజ్రీవాల్ సర్కార్.
కరోనా తీవ్రత దృష్ట్యా.. హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మణిపుర్ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు తరలివెళ్లాయి. కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్న జిల్లాల్లో సందర్శించి.. నివారణ చర్యలపై దృష్టి సారిస్తాయి.
ఫైజర్ రావడానికి రంగం సిద్ధం..!
ట్రంప్ పోయాడు.. మాస్క్ వచ్చేసింది..!