ప్రపంచ దేశాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 48 లక్షలు దాటింది. మరణాలు 13 లక్షల 24 వేలు దాటాయి.
అమెరికాలో తాజాగా లక్షా 37 వేల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 10 లక్షలు దాటింది. మరో 579 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2 లక్షల 51 వేలు దాటింది.
అమెరికాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తొలుత కాలిఫోర్నియాలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయగా.. ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్. అనంతరం టెక్సాస్, వాషింగ్టన్, మిషిగన్ రాష్ట్రాలు కూడా.. వైరస్ వ్యాప్తి నివారణకు కాలిఫోర్నియా మార్గాన్నే అనుసరిస్తున్నాయి.
మూడో దశకు భారత్ బయోటెక్ టీకా..!
ఫైజర్.. వచ్చేస్తుంది.. భారీ స్థాయిలో పరీక్షలు..!