ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించిది ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్..
రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించడం మంచి పరిణామం. ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి భారీ నష్టం. కేంద్రం నుంచి సాయం కూడా అందక సమస్య మరింత జఠిలమైంది.
2018-2019 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.1,91,063.61
రెవెన్యూ వ్యయం రూ. లక్షా 50 వేల 270 కోట్లు
మూలధన వ్యయం రూ. 28 వేల 671 కోట్లు
ఇంధర రంగానికి రూ 5,052.54 కోట్లు
వ్యవసాయానికి రూ. 12,355.32 కోట్లు
సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నాం. వ్యవసాయానికి గతంతో పోలిస్తే 35.91శాతం అధికంగా నిధులు. గ్రామీణాభివృద్ధి రూ. 20,815.98 కోట్లు. ఎస్సీ, ఎస్టీలే కాకుండా, కాపులు, వైశ్యులు, బ్రాహ్మణ, తదితర కులాల్లో వెనుకబడిన వారికి కూడా సహాయం అందించేలా సంక్షేమ పథకాలు
స్వయసహాయక బృందాలకు ఆర్థికసాయం