కరెన్సీ అవకతవకల(మ్యానిప్యులేటెడ్) దేశాల పరిశీలన జాబితాలో భారత్తో పాటు తైవాన్, థాయ్లాండ్ దేశాలను చేర్చింది అమెరికా. వియత్నాం, స్విట్జర్లాండ్ దేశాలను సైతం ఇదే జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్, మలేసియా దేశాలు ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో నుంచి ఐర్లాండ్ను తొలగించినట్లు అమెరికా ట్రెజరీ శాఖ తెలిపింది.
జూన్ 2020 వరకు నాలుగు త్రైమాసికాలలో తమ ప్రధాన వాణిజ్య భాగస్వాములైన వియత్నాం, స్విట్జర్లాండ్, భారత్, సింగపూర్ దేశాలు.. విదేశీ మారక మార్కెట్లో విరుద్ధ ప్రమాణాలు పాటించాయని పేర్కొంది అమెరికా. వియత్నాం, స్విట్జర్లాండ్ దేశాలు.. తాము ఏర్పాటు చేసిన రెండు ప్రమాణాలను అధిగమించాయని తెలిపింది. ఈ పరిణామాల వల్ల అమెరికా ఆర్థిక వృద్ధితో పాటు దేశంలోని సంస్థలు, కార్మికులకు హాని కలుగుతుందని పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.