- Advertisement -
బంగారం , పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెనుభారం కానున్నాయి. బడ్జెట్లో ప్రజలకు వరాలు ఉంటాయనుకుంటే పన్నుల మోత మోగించింది కేంద్రం. పెట్రోల్, డీజిల్పై రూ.1 సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు పన్నుల భారం మోయకతప్పదు.
మరో వైపు బంగారం సహా ఇతర విలువైన లోహాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. బంగారంపై సుంకాల పెంపుతో స్వర్ణాభరాణాలు మరింత ప్రియం కానున్నాయి.