- Advertisement -
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దిగొస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచాయి. కానీ స్థానిక, ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు మాత్రం తమ రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించే ప్రసక్తే లెదని తేల్చి చెప్పాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. పెట్రోల్పై వ్యాట్ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు డీజిల్పై కూడా వ్యాట్ తగ్గించింది. దీంతో పెట్రోల్పై 8 రూపాయలు తగ్గనుంది. దీంతో పాటు పెట్రోల్పై 10 తగ్గనున్నాయి. ఈ ధరలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అమలుకానున్నాయి.