Thursday, May 9, 2024
- Advertisement -

బాబునే టార్గెట్ చేసి భాజాపా మ‌హిళా సీనియ‌ర్‌నేత‌..మాజీ మంత్రి

- Advertisement -
Purandeswari comments on AP CM Nara Chandrababu Naidu

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబుకి రాష్ట్రంలోని ప‌రిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఏప‌ని చేసినా అది బాబు మెడ‌కు చుట్టుకుంటుండంతో ఏం చేయాలో తెలియ‌క అయేమ‌య స్థితిలో ఉన్నారు.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌లో సీనియ‌ర్ల‌నుంచి వ‌చ్చిన అసంతృప్తి త‌ర్వాత లోకేష్ మాట‌తీరు,ఇసుక మాఫియా, అధికారుల‌పై దైర్జ‌న్యాలు…ఇప్పుడు తాజాగా ప‌త్తికొండ నియేజ‌క వ‌ర్గంలో వైసీపీనేత హ‌త్య ఇలా అన్ని స‌మ‌స్య‌లు బాబును ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి.
ప్ర‌తిప‌క్షాల‌నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లకు త‌గిన విధంగా స్పందించ‌వ‌చ్చు కాని మిత్ర‌ప‌క్షం భాజాపా నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో ఏం మాట్లాడాలో తెలియ‌కు ఉక్కిరి బిక్కిరి అవుత‌న్నారు.బాబుకు బ‌ద్ద‌శ‌త్రువైన భాజాపా సీనియ‌ర్‌నేత ..మాజీ మంత్రి పురందేశ్వ‌రి చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.ప్ర‌తీ సారి బాబునే టార్గెట్‌చేయ‌డంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్నా వీలు దొరికిన‌ప్పుడల్లా బాబునే టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగామారింది. గతంలో రాజ‌ధాని భూకుంభ‌కోనంపై ఆమె చేసిన వ్యాఖ్య‌లు పెద్ద క‌ల‌క‌లాన్నే రేపాయి.కేంద్రం రాష్ట్రఅభివృద్ధికి నిధులు ఇస్తున్నా …క్రెడిట్ మాత్రం భాజాపాకు ద‌క్క‌డంలేద‌ని బాబునే టార్గెట్ చేశారు.
ఇప్పుడు తాజాగా క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియేజ‌క వ‌ర్గంలో చోటుచేసుకున్న వైసీపీనేత దారున హ‌త్య నేప‌థ్యంలో పురందేశ్వ‌రి చేసిన వ్యాఖ్యలు బాబును ఇమేజ్ దెబ్బ‌తిన‌డంతోపాటు ఆపార్టీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి.ఈ హ‌త్యను వెనుక ప‌త్తికొండ ఎమ్మెల్యే డిప్యూటి హోంమంత్రి కే.యీ,కృష్ణ‌మూర్తి హ‌స్తం ఉంద‌ని ఆరోప‌న‌ల నేప‌థ్యంలో…బాబుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే రాజ‌కీయ హ‌త్య‌లు ప్రోత్స‌హిస్తున్నార‌ని చేసిన వ్యాఖ్య‌ల‌తో బాబుతోపాటు ….పార్టీ నాయ‌కులు కంగుతిన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ప‌త్తికొండ‌లో జ‌రిగిన హ‌త్య‌పై భాజాపా నేత‌లు ఎవ‌రూ స్పందించ‌లేదు.కాని పురందేశ్వ‌రి స్పందించ‌డం చూస్తె బాబే టార్గెట్‌గా కినిపిస్తోంద‌న్న సందేహాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. టీడీపీ మాత్రం కొరివితో ఎందుకు త‌ల‌గోక్కోవ‌డం ఎందుక‌ని బాబుతోపాటు మిగితా నాయ‌కులు మౌనం పాటిస్తుస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -