బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్గా నియమించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే కేంద్ర న్యాయశాఖ పదవికి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు తాజాగా గవర్నర్గా అవకాశం వచ్చింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో రవిశంకర్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.
ఎంతో సమర్థుడైన వ్యక్తి, సీనియర్ నేత అయిన రవిశంకర్ ప్రసాద్ను మంత్రివర్గం నుంచి తప్పించడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన కొంతకాలంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్తో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా భన్వరీలాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. తమిళరాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో రాజకీయంగా ఎంతో యాక్టివ్గా ఉండే రవిశంకర్ ప్రసాద్ను అక్కడికి పంపించడం వెనక బీజేపీ వ్యూహం ఉండొచ్చన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read
చిన్న తల ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు..!