పేదలకి బ్యాంకింగ్ సౌకర్యం దగ్గరగా ఉండాలి అనే ఆలోచనతో ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి తేలికగా ఉండేలా మొదలు పెట్టిన జన ధన్ ఎకౌంటు లలో ఇప్పుడు కోటాను కోట్ల నల్లదనం వచ్చి చేరిన సంగతి తెలిసిందే.ఈ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాలపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది.
నగదు ఉపసంహరణ నిబంధనలను విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ, జన్ ధన్ ఖాతాదారులందూ కేవైసీ (నో యువర్ కస్టమర్) పత్రాలు ఇవ్వాలని, స్పష్టం చేసింది. కేవైసీ పత్రాలను బ్యాంకుకు సమర్పించిన వారు నెలకు రూ. 10 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కేవైసీ పత్రాలు ఇవ్వని వారు నెలకు రూ. 5 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరని తెలిపింది. నల్ల దానం విషయం లో అందరూ అక్రమార్కంగా అమాయకులని అడ్డం పెట్టుకుని డబ్బు దాచుకుంటున్న నేపధ్యం లో వారిని ఇరికించే పని లేకుండా నల్లధనం దాచుకున్న ఒక్కొక్కరినీ బయటకి లాగడం కోసం మోడీ ప్రభుత్వం కొత్త లెక్కలు రాస్తున్నట్టు తెలుస్తోంది.