- Advertisement -
చిత్తూరు జిల్లా ఉపపోరులో.. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలోని బీఎన్ కండ్రిగ మండలంలోని కుక్కంభాకం, పార్లపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో సాంకేతిక సమస్యలతో చాలాసేపటివరకు పోలింగ్ ప్రారంభం కాలేదు.
ఉపఎన్నికల్లో భాగంగా.. నెల్లూరు జిల్లా గూడూరులోని 47, 48, 48 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాకాడులోని 285వ పోలింగ్ కేంద్రం, రావిగుంటపాలెంలోని రెండు కేంద్రాల్లో ఈవీఎంలకు బ్యాటరీ లేని కారణంగా.. ప్రక్రియ నిలిచిపోయింది. సైదాపురం మండలంలోని 3 గ్రామాలోను ఈవీఎంల సమస్య ఏర్పడింది. రామసాగరం, గులించెర్ల, కేజీఆర్పాలెంలో పోలింగ్ నత్తనడకన సాగుతోంది.
నైట్ కర్ఫ్యూ ఉన్నా.. నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది.. అడ్డంగా బుక్ అయ్యింది!