వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రత్యేకహోదా విషయంలో ఎలా ముందుకెల్లాలనే దానిపై చర్చించారు. ఇప్పటికే అనేక సార్లు అవిశ్వాస తీర్మానం వియిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తన పార్టీ ఎంపీలు వచ్చే నెల 6వ తేదీన రాజీనామా చేస్తారని, అంతకన్నా ముందుగానే తామిచ్చిన అవిశ్వాస నోటీసులపై చర్చించకుండా పార్లమెంట్ ను వాయిదా వేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తే, వాయిదా వేసిన రోజునే ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
పార్లమెంట్ ను రేపు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తే, రేపే ఎంపీలంతా రిజైన్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తమ ఎంపీల రాజీనామా పత్రాలు ఉంటాయని అన్నారు.