Saturday, April 27, 2024
- Advertisement -

మళ్లీ హస్తినకు కేసీఆర్

- Advertisement -

కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఇటీవలే ఢిల్లీలో దీక్ష చేపట్టిన కేసీఆర్.. మంగళవారం మరోసారి హస్తిన వెళుతున్నారు. ఈసారి పది రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. రైతు సంఘాల నేతలతో సమావేశమై జాతీయ స్థాయిలో ఉద్యమానికి ప్లాన్ చేయనున్నారని చెబుతున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీకి కేసీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు వాహనాన్ని ఎక్కించిన ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ పరిహారం అందించనున్నారు. తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సమావేశం కానున్నారు.

హనుమాన్ దీక్ష తీసుకున్న ఎన్టీఆర్

ఏపీ నిధుల దారి మళ్లింపుపై సుప్రీం సీరియస్

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఖరారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -