కాసేపట్లో 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.30 కి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం… వార్షికపద్దుకు ఆమోదముద్ర వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆశావహ దృక్పథంతోనే బడ్జెట్ రూపుదిద్దుకొంది.
కరోనా కష్టకాలం ఆ తర్వాత క్రమేణా వివిధ రంగాలు పుంజుకున్న నేపథ్యంలో బడ్జెట్ ఆశాజనకంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా కారణంగా మొదట్లో రాబడులు, ఆదాయం భారీగా తగ్గినప్పటికీ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బాగా పెరిగాయి. చివర్లో పెరిగిన అంచనాల ఆధారంగానే 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
బెంగాల్ లో బాంబు దాడి.. బిజేపి ఎంపీ టార్గెట్..!