మన హెల్త్ ను కాపాడుకోవడం మనందరి బాధ్యత. దాంతో మనం ఎంతో ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతాం. మన ఆరోగ్యం విషయంలో నీళ్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. తాగే నీరు మంచిదై ఉండాలి. దాంతో ఎన్నో రోగాలు రాకుండా చేయొచ్చు. అలాగే ఎన్నో రోగాలను తరిమి కొట్టొచ్చు. అయితే ఈ తాగు నీటి విషయంలో పలు జాగ్రత్తలు కూడా ఎంతో అవసరం.
అందులో తాగే నీళ్లను వేడి చేసుకుని తాగాలని. అలా చేస్తే హెల్త్ కు ఎంతో మంచిదని ఎంతో మంది వైద్యులు చెబుతుంటారు.ఇలా చేయడం వలన బరువును తగ్గించుకోవచ్చట. అలాగే పలురకాల జబ్బుల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు. శీతాకాలం, వర్షాకాలం సమయాల్లో సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే కాచిన నీళ్లను తాగాలని వైద్యులు చెబుతుంటారు.
గోరు వెచ్చని నీటితో ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గోరు వెచ్చని నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లను తాగితే మలబద్ధకం, అజీర్తీ సమస్యలు పోతాయి. అలాగే అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.
‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేపనున్నదీపిక !
డయాబెసిట్ ముందస్తు లక్షణాలు ఇవిగో ..!