హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది రీమా సేన్. ఆమె 15 ఏళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది.
బెంగాలీ చిత్రాల్లో నటించిన ఆమె.. 2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన సినిమా ’చిత్రం’ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు ఉదయ్ కిరణ్ కు, ఇటు రీమా సేన్ కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే మూవీలో నటించిన ఆమె శింబుతో కలిసి వల్లభ సినిమాలో నటించింది. వల్లభలో విలన్ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు పొందిన రీమా సేన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది.
2012 వరకు సినిమాల్లో చేసిన ఆమె 2012 లోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఆతర్వాత ఏ సినిమాల్లోనూ కనిపించలేదు ఈ అందాల భామ. అయితే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది రీమా సేన్. త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి ఈ భామ రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.
యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?
షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?