ప్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ…. ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ … ఈ నానుడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ – జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు.. ఉత్తుత్తి హైప్ లను నమ్ముకుని ముందుకు వెళ్తోంది
అభివృద్ధి సంక్షేమ పథకాలతోబాటు అశేష మైన కార్యకర్తలబలంతో దూసుకుపోతున్న జగన్ను ఎదుర్కోవడం అసాధ్యం అని ఇప్పటికే కూటమికి అర్థం అయింది. దీంతో తమ భవిష్యత్ కళ్ళముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు.
అందులో భాగముగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తో ఒక తప్పుడు కామెంట్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడా .. ఒక్క ముక్క చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు
కానీ జగన్ ముందు వీళ్లంతా దిగదుడుపే అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా .. మళ్ళీ వచ్చేది జగనే అని, ఎవరెన్ని చెప్పినా జగన్ గెలుపును ఆపలేరని ప్రజలు అంటున్నారు.