Monday, May 6, 2024
- Advertisement -

టీమిండియా ఐర్లాండుతో టీ20 షెడ్యూల్‌ ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసినను బీసీసీఐ..

- Advertisement -

విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్‌తో ట్వంటీ20 సిరీస్‌ ఆడనుంది. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత బీసీసీఐ పాలక మండలి ఐర్లాండ్‌ పర్యటన షెడ్యూలు ఖరారు చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కంటే ముందుగానే భారత జట్టు ఐర్లాండ్‌కు బయలుదేరనుందని బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) వెల్లడించింది.

డబ్లిన్‌ వేదికగా రెండు టీ20లు జరగనున్నాయి. జూన్‌ 27న తొలి టీ20, 29న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా, ఐర్లాండ్‌ జట్లు తలపడతాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరీ ఓ ప్రకటన విడుదల చేశారు. 2007 జూన్‌లో భారత్ జట్టు చివరిసారిగా ఐర్లాండ్‌లో పర్యటించడం విశేషం.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ జట్టు అక్కడే ఫిబ్రవరి 24 వరకు ఉండనుంది. ఈ పర్యటన ముగియగానే.. ఐపీఎల్.. ఆ తర్వాతే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ జరగనుంది. 2009‌ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో భారత్ జట్టు చివరిసారి టీ20 మ్యాచ్ ఆడింది. అయితే భారత్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ ఇప్పటివరకూ జరగలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -