భారత క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పౌతాఫ్రికాలో ఆదేశంలో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ లలో ఘోర పరాజయం పాలైంది. ఓటమి భారంతో నిరాశలో ఉన్న టీం ఇండియాకు మరోషాక్ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ భారీ జరిమానా విధించింది.
మ్యాచ్ ఫీజులో 40శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పై క్రాఫ్ట్ తెలిపారు. మొత్తం మీద సౌతాఫ్రికా పర్యటన భారత జట్టుకు చేదు జ్ఙాపకాలనే మిగిల్చింది. టెస్టు, వన్డేలలో కలిసి మొత్తం 6 మ్యాచులు ఆడగా కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్లో మాత్రమే టీం ఇండియా గెలిచింది. మిగతా ఐదు మ్యాచులలో పరాజయం పాలైంది.
రోహిత్ శర్మ గాయంతో బాధపడుతుండడంతో కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా పగ్గాలు అందుకున్నాడు. మొదటి సారి రాహుల్ కు నిరాశే మిగిలింది. అలాగే ఈ సిరీస్ తో హెడ్ కోచ్ గా నియమితులైన రాహుల్ ద్రమిడ్ కు కూడా సౌతాఫ్రికా టూర్ నిరాశనే మిగిల్చింది.
Also Read